rajani: సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న '2.ఓ'

  • అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ 
  • ప్రత్యేక ఆకర్షణగా రెహ్మాన్ సంగీతం
  • ఈనెల 29వ తేదీన విడుదల  

రజనీకాంత్ కథానాయకుడిగా .. అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా శంకర్ '2.ఓ' రూపొందించాడు. ఎమీ జాక్సన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ తో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.

రోబోల మధ్య జరిగే పోరాటాన్ని చూడటానికి అంతా ఆసక్తిని కనబరుస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలవనున్నాయి. ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. సంచలన విజయానికి ఈ సినిమా తెరతీయనుందనే అభిప్రాయాన్ని ఇటు రజినీ అభిమానులు .. అటు అక్షయ్ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. 'రోబో'ను మించిన విజయం సాధిస్తుందనే శంకర్ మాట నిజమవుతుందేమో చూడాలి.      

More Telugu News