ambika: శ్రీదేవి .. సౌందర్య నా బెస్ట్ ఫ్రెండ్స్: అంబిక

  • శ్రీదేవి ఇంటికి వెళ్లే దానిని 
  • ఇద్దరం కబుర్లు చెప్పుకునే వాళ్లం
  • సౌందర్య .. నేను ఐస్ క్రీమ్స్ తినేవాళ్లం    

తాజాగా సీనియర్ కథానాయిక అంబిక 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు. "ప్రేమాభిషేకం .. 'బొబ్బిలిపులి' సమయంలో శ్రీదేవి .. నేను ఎంతో సన్నిహితంగా వుండే వాళ్లం. ఆదివారం వస్తే చాలు శ్రీదేవి ఇంటికి వెళ్లిపోయే దానిని. ఇద్దరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకునే వాళ్లం .. సినిమాలు చూసేవాళ్లం.

శ్రీదేవి తరువాత అంతగా నాకు దగ్గరైంది సౌందర్య. ప్రతి రెండు మూడు రోజులకొకసారి సౌందర్యకి ఫోన్ చేసే దానిని. నేను ఎప్పుడు బెంగళూర్ వెళ్లినా సౌందర్యను కలిసే దానిని. తాను షూటింగు పూర్తి చేసుకుని వచ్చిన వెంటనే నన్ను ఐస్ క్రీమ్ పార్లర్స్ కి తీసుకెళ్లేది. ప్రమాదం జరగడానికి రెండు రోజుల ముందు కూడా నాతో మాట్లాడింది. ప్రమాదం జరిగిన సమయంలో కూడా నేను ఫోన్ చేశాను గానీ కలవలేదు. ఆ తరువాతే సౌందర్య చనిపోయిన వార్తను టీవీలో చూశాను" అని చెప్పుకొచ్చారు.    

More Telugu News