Ramgopal varma: రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో పాటపాడుతున్న ఎస్పీ బాలు

  • లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో అద్భుతమైన పాటపాడారన్న ఆర్జీవీ
  • ప్రముఖుల్లోనే ప్రముఖుడంటూ ప్రశంస
  • సిరాశ్రీ పాటకు కల్యాణ్ మాలిక్ సంగీతం

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటపాడారనేదే ఆ అప్‌డేట్. ఈ విషయాన్ని స్వయంగా రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ప్రముఖుల్లోనే అతి ప్రముఖుడైన ఎస్పీబాలు గారు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కోసం ఓ పాట పాడారని, సిరాశ్రీ రాసిన ఈ అద్భుతమైన పాటకి కల్యాణ్ మాలిక్ సంగీతం అందించాడని ఆర్జీవీ పేర్కొన్నాడు.

కాగా,  ఈ సినిమాపై పలు విమర్శలు కూడా ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్న  ఈ సినిమాలో వివాదాస్పద అంశాలను తెరకెక్కిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. 

More Telugu News