nayanatara: నయనతార బాటలో నడవనున్న ఇలియానా

  • తెలుగులో అందుకే గ్యాప్ వచ్చింది 
  • శ్రీను వైట్ల నాకు మంచి పాత్రను ఇచ్చారు 
  • నా పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది 

తెలుగులో నాజూకు సుందరిగా మంచి మార్కులు కొట్టేసిన ఇలియానా, కొంత గ్యాప్ తరువాత 'అమర్ అక్బర్ ఆంటోని' చేసింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, ఈ నెల 16వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇలియానా మాట్లాడుతూ, డేట్స్ కుదరకపోవడం వలన .. కథలు నచ్చకపోవడం వలన తెలుగులో గ్యాప్ వచ్చింది. ఈ కథ బాగా నచ్చడం వలన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను.

నా పాత్రను శ్రీను వైట్ల చాలా అద్భుతంగా మలిచాడు. తప్పకుండా ఈ పాత్ర ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది .. నాకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఇక నాయిక ప్రాధాన్యత కలిగిన పాత్రలను ఎక్కువగా చేయాలనుకుంటున్నాను. ఆ తరహా పాత్రల్లో నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను. అలాంటి పాత్రల కోసం వెయిట్ చేస్తున్నాను" అని చెప్పుకొచ్చింది. మొత్తానికి ఇలియానా .. నయనతార బాటలో నడవాలనే నిర్ణయానికి వచ్చేసిందన్న మాట.     

More Telugu News