Congress: చత్తీస్‌గఢ్‌లో పోలింగ్‌కు ముందు కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ.. రాష్ట్ర ఉపాధ్యక్షుడి రాజీనామా!

  • పార్టీని వీడిన వైస్ ప్రెసిడెంట్ ఘనరామ్ సాహు
  • పోలింగ్‌కు కొన్ని గంటల ముందు నిర్ణయం 
  • నేడు బీజేపీ తీర్థం

పోలింగ్‌కు ముందు చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ఘనరామ్ సాహు పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన సాహు దుర్గ్ సిటీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. తనకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఆయన పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రంలోని 8 స్థానాలకు తొలి విడత పోలింగ్ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు ఆయన తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేసింది.

More Telugu News