cpi: సీపీఐతో చర్చలు ఫలప్రదంగా ముగిశాయి: ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్ కృష్ణన్

  • మహాకూటమిలో సీట్ల సర్దుబాటు సమస్య కాదు
  • ‘కాంగ్రెస్’ అభ్యర్థుల జాబితా ప్రకటనకు కొంత సమయం  
  • తెలంగాణలో మహాకూటమి ప్రభుత్వం రాబోతోంది

తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. హైదరాబాద్ లోని  సీపీఐ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. అనంతరం ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్ కృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ, సీపీఐతో చర్చలు ఫలప్రదంగా ముగిశాయని, తెలంగాణలో మహాకూటమి ప్రభుత్వం రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు సమస్యే కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటనకు కొంత సమయం పట్టే అవకాశముందని అన్నారు.

More Telugu News