india: చెన్నై వేదికగా చివరి టీ20 మ్యాచ్.. ఏడు గంటలకు ప్రారంభం

  • తలపడనున్న భారత్ - వెస్టిండీస్ జట్లు
  • ఇప్పటికే అధిక్యంలో ఉన్న టీమిండియా
  • సిరీస్ ను కైవసం చేసుకోనున్న భారత్ జట్టు

భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య మూడు టీ 20 మ్యాచ్ లలో భాగంగా చివరి మ్యాచ్ ఈరోజు ఏడు గంటలకు ప్రారంభం కానుంది. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. నాలుగు రోజుల విరామం తర్వాత చివరి మ్యాచ్ నేడు జరుగుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లలో విజయం సాధించిన టీమిండియా, ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధిస్తే క్లీన్ స్వీప్ చేసినట్టవుతుంది. ఈ సిరీస్ లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలవాలని విండీస్ జట్టు చూస్తోంది.  

More Telugu News