YSRCP: ఎక్కడా కుదరదనే ఎయిర్ పోర్టును ఎంచుకున్న తెలుగుదేశం: వైఎస్ విజయమ్మ

  • పలు చోట్ల రెక్కీ చేశారు
  • ప్రజల మధ్యలో సాధ్యం కాలేదు
  • అందుకే ఎయిర్ పోర్టులో హత్యాయత్నం
  • హైదరాబాద్ లో మీడియాతో విజయమ్మ

తన కుమారుడు వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తుండగా హత్య చేయాలని ప్లాన్ చేసిన కొందరు టీడీపీ నేతలు, పలు చోట్ల రెక్కీ నిర్వహించారని, ప్రజల మధ్యలో ఆ పని చేయలేకనే విశాఖపట్నం ఎయిర్ పోర్టును ఎంచుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిప్పులు చెరిగారు. ఈ ఉదయం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆమె, జగన్ కు ఇదో పునర్జన్మని, తన బిడ్డ దేవుడి దయవల్ల ప్రాణాపాయం నుంచి బయట పడగలిగాడని అన్నారు.

ఈ దాడి తరువాత తెలుగుదేశం పార్టీ నాయకులు, ఓ తల్లిపైనా, ఓ చెల్లిపైనా చేసిన విమర్శలు వింటుంటే బాధేస్తోందని విజయమ్మ వ్యాఖ్యానించారు. అన్ని మాటలనూ తాము మౌనంగా భరిస్తూ వచ్చామని, తన భర్త వైఎస్ రాజశేఖరరెడ్డి మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారని, దాన్ని ఆ పార్టీ పెద్దలు మరచిపోయారని అన్నారు. నేటికి కూడా రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని ఇబ్బందులు పెట్టాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయని విమర్శలు గుప్పించారు.

More Telugu News