Jagan: ఎడమ చేతిని మాత్రం తాకనీయద్దు: జగన్ కు వైద్యుల హెచ్చరిక!

  • రేపటి నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర
  • ఎడమ చేతిని పైకి లేపవద్దు
  • జగన్ కు సూచించిన వైద్యులు

రేపటి నుంచి వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభం కానుండగా, ఈ ఉదయం ఆయనకైన గాయాన్ని పరిశీలించిన వైద్యులు కీలక సూచనలు చేశారు. పాదయాత్ర సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎడమ చేతిని ఎవరూ తాకకుండా చూసుకోవాలని, సాధ్యమైనంత వరకూ ఆ చేతిని పైకి లేపే ప్రయత్నం చేయవద్దని తెలిపారు.

ఈ మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే గాయం పూర్తిగా మానేందుకు సమయం పడుతుందని హెచ్చరించారు. ఈ మేరకు జగన్ యాత్రలో ఎడమవైపు ఎవరూ లేకుండా చూస్తామని వైకాపా వర్గాలు వెల్లడించాయి. కాగా, జగన్ తన పాదయాత్ర, ప్రసంగాల్లో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే ఎడమ చేతిని పైకెత్తి అభివాదాలు చేస్తారన్న సంగతి తెలిసిందే.

More Telugu News