amaravathi: అమరావతికి రాహుల్ గాంధీ సహా 10 మంది కీలక నేతలు.. చంద్రబాబు నివాసంలో విందు!

  • డిసెంబర్ 23న అమరావతికి వచ్చేస్తున్న నేతలు
  • జాబితాల మమతా, ఫరూక్ అబ్దుల్లా, కుమారస్వామి తదితరులు
  • ధర్మపోరాట దీక్షలో పాల్గొననున్న నేతలు

కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ వచ్చే నెల 23న అమరావతికి రానున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో జరగనున్న విందు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. రాహుల్ తో పాటు కుమారస్వామి, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, తేజస్వి యాదవ్ సహా 10 మంది నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్టు తెలుస్తోంది. అనంతరం అదేరోజు అమరావతిలో నిర్వహించే ధర్మపోరాట దీక్షలో వీరంతా పాల్గొననున్నారు. రాహుల్ సహా దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పార్టీల నేతలంతా అమరావతికి వస్తున్నారనే వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

More Telugu News