Telangana: తెలంగాణలో 13 సమస్యాత్మక నియోజకవర్గాలు.. ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకే పోలింగ్!

  • 13 సమస్యాత్మక నియోజకవర్గాలను గుర్తించిన ఎన్నికల సంఘం
  • ఈ నియోజకవర్గాల్లో గంట ముందే ముగియనున్న పోలింగ్
  • డిసెంబర్ 7న పోలింగ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 13 సమస్యాత్మక నియోజకవర్గాలను ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ నిర్వహిస్తామని చెప్పింది. మిగిలిన 106 నియోజకవర్గాల్లో యథావిధిగా ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపింది. సమస్యాత్మక నియోజకవర్గాల్లో బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, మంథని, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, భద్రాచలం, అశ్వారావుపేటలు ఉన్నాయి. డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.

More Telugu News