vishal: 'టెంపర్' తమిళ రీమేక్ అప్డేట్

  • వెంకట్ మోహన్ దర్శకుడిగా 'టెంపర్' రీమేక్ 
  • కథానాయికగా రాశి ఖన్నా 
  • కీలక పాత్రలో పార్తీబన్    

ఎన్టీఆర్ .. పూరి జగన్నాథ్ కాంబినేషన్లో 2015లో వచ్చిన 'టెంపర్' భారీ విజయాన్ని సాధించింది. దాంతో ఈ సినిమాను రీమేక్ చేయడానికి ఇతర భాషా చిత్రాల దర్శకనిర్మాతలు పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళంలో ఈ సినిమా రీమేక్ లో హీరోగా విశాల్ చేస్తున్నాడు. తమిళనాట తనకి గల మాస్ ఫాలోయింగ్ వలన విశాల్ ఈ కథను ఎంచుకున్నాడు.

మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. కొన్ని రోజులుగా వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటూ వచ్చిన ఈ సినిమా ఈ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ తెరకెక్కించారు. ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, విశాల్ సరసన రాశి ఖన్నా కనిపించనుంది. పార్తీబన్ కీలకమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.    

More Telugu News