Hyderabad: హైదరాబాద్‌లోని యాకత్‌పురాలో రూ.68 లక్షలు పట్టివేత

  • సంతోష్‌నగర్‌లో పోలీసుల తనిఖీలు
  • వాహనంలో తరలిస్తున్న సొమ్ము పట్టివేత
  • ఏటీఎంలో డబ్బులు పెట్టే ఏజెన్సీదిగా అనుమానం

హైదరాబాద్‌లోని యాకత్‌పురా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున డబ్బు పట్టుబడింది. సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో తరలిస్తున్న రూ. 68 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సొమ్ముకు సంబంధించిన ఎటువంటి పత్రాలు వారి వద్ద లేకపోవడంతో డబ్బులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. విచారణలో అన్ని వివరాలు వెల్లడవుతాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ సొమ్ము ఏటీఎంలో డబ్బులు పెట్టే ఓ ఏజెన్సీకి చెందినదిగా సమాచారం. అయితే, అందుకు సంబంధించిన సరైన వివరాలు ఇవ్వడంలో విఫలం కావడంతో పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం పూర్త వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

More Telugu News