Chandrababu: చంద్రబాబును కలిసేందుకు రేపు అమరావతికి వస్తున్న రాహుల్ దూత అశోక్ గెహ్లాట్

  • ఊపందుకున్న మహాకూటమి ఏర్పాటు చర్చలు
  • రేపు మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు, గెహ్లాట్ ల భేటీ
  • పలు అంశాలపై చర్చించే అవకాశం

జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలను ఏకం చేస్తూ, మహాకూటమిని ఏర్పాటు చేసే క్రమంలో పలువురు నేతలతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అవుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ అధినేత రాహుల్ తో కూడా చంద్రబాబు చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం కాంగ్రెస్ శిబిరంలో కూడా ఉత్సాహం పెరిగింది. ఈ నేపథ్యంలో, చంద్రబాబును కలిసేందుకు రాహుల్ గాంధీ దూత, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ రేపు అమరావతికి వస్తున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు వీరు భేటీ కానున్నారు. మహాకూటమి సహా పలు అంశాలపై వీరు చర్చించే అవకాశం ఉంది. 

More Telugu News