Cricket: వెస్టిండీస్ తో మూడో టీ20 కోసం జట్టులో మార్పులు చేసిన బీసీసీఐ!

  • కీలక బౌలర్లకు విశ్రాంతి 
  • ఆస్ట్రేలియా టూర్ కి ఫిట్ నెస్ తో ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం
  • జట్టులోకి కొత్తగా సిద్ధార్థ్ కౌల్ ఎంపిక

వెస్టిండీస్ తో మూడో టీ20 ఆడే టీమ్‌ను బీసీసీఐ కాసేపటి క్రితం ప్రకటించింది. కీలక బౌలర్లు అయినా ఉమేష్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ లకు విశ్రాంతినిచ్చారు. త్వరలో ఆస్ట్రేలియా పర్యటన ఉన్నందున ఈ ముగ్గురు బౌలర్లు ఫిట్ నెస్ తో ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. కొత్తగా జట్టులోకి సిద్ధార్థ్ కౌల్ ని ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. కాగా, ఈనెల 11న చెన్నైలో మూడో టీ20 జరగనుంది.

భారత జట్టు: 

రోహిత్ శర్మ, ధావన్, రాహుల్, కార్తీక్, మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, షాబాజ్ నదీమ్, సిద్ధార్థ్ కౌల్

More Telugu News