yash: ఉత్కంఠను రేకెత్తిస్తోన్న 'కేజిఎఫ్' ట్రైలర్

  • తెలుగులోకి కన్నడ మూవీ 
  • కీలక  పాత్రలో రమ్యకృష్ణ 
  • డిసెంబర్ 21వ తేదీన విడుదల

ఈ మధ్య కాలంలో యువ దర్శకులు కొత్తదనం కలిగిన కథల ద్వారా తమ సత్తాను చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలా విభిన్నమైన కథాంశంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి 'కేజిఎఫ్' సినిమా రెడీ అవుతోంది. యష్ .. శ్రీనిధి శెట్టి నాయకా నాయికలుగా నటించిన ఈ కన్నడ సినిమాలో, రమ్యకృష్ణ .. నాజర్ కీలకమైన పాత్రలను పోషించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ముంబైతో ముడిపడిన గోల్డ్ మైన్స్ మాఫియా నేపథ్యంలో సాగే కథ ఇది. ఆసక్తికరమైన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. "నీ వెన్నంటి వేలమంది ఉన్నారనే ధైర్యం నీకుంటే ఒక యుద్ధాన్ని మాత్రమే గెలుస్తావు. అదే నువ్వు ముందున్నావని నీ వెనకున్న వేలమందికి ధైర్యం వచ్చిందంటే ఈ ప్రపంచాన్నే గెలుస్తావు"అనే డైలాగ్ బాగుంది. డిసెంబర్ 21వ తేదీన ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు.

More Telugu News