sai dharam tej: రంగంలోకి దిగుతోన్న మెగా హీరో!

  • తేజు హీరోగా 'చిత్రలహరి'
  • 40 రోజుల పాటు షూటింగ్ 
  • 60 శాతం పూర్తి చేయాలనే ప్లాన్

సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో తేజు సరసన కల్యాణి ప్రియదర్శన్ .. నివేదా పేతురాజ్ కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ప్రారంభించనున్నారు.

ఏకధాటిగా 40 రోజులపాటు షూటింగ్ జరపనున్నారు. ఈ షెడ్యూల్ లోనే 60 శాతం షూటింగును పూర్తిచేయనున్నారట. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఆయన సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలవనుందని అంటున్నారు. ఈ సినిమాతో తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో తేజు వున్నాడు. 

More Telugu News