KCR: టీడీపీలో చేరేందుకు సిద్ధమైన కేసీఆర్ అన్న కుమార్తె!

  • చంద్రబాబును కలిసిన రమ్య
  • టీడీపీలో చేరే అంశంపై చర్చ
  • కాంగ్రెస్ నేతల వైఖరితో మనస్తాపం

తెలంగాణలో రాజకీయం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్న కుమార్తె రమ్య సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆమె ఏపీ సీఎం చంద్రబాబును కలిసి టీడీపీలో చేరే అంశాన్ని ప్రతిపాదించారు.

గతంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న రమ్య ఆ పార్టీ నేతల వైఖరితో మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది. దీంతోనే ఆమె సైకిల్ జర్నీకి సిద్ధమైనట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని టీటీడీపీ నేతలతో చర్చించిన చంద్రబాబు ఈ సమయంలో రమ్యను పార్టీలోకి తీసుకుంటే రెచ్చగొట్టినట్టవుతుందేమోననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలతో టీటీడీపీ నేతలు కూడా ఏకీభవించినట్టు తెలుస్తోంది.

More Telugu News