Ayodhya: దీపావళి వేళ.. ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న అయోధ్య

  • 3 లక్షలకు పైగా దీపాలను వెలిగించిన అయోధ్యవాసులు
  • ఐదు నిమిషాల్లోనే వెలిగించి ప్రపంచ రికార్డ్
  • కార్యక్రమంలో పాల్గొన్న యోగి, కిమ్ జాంగ్ సూక్

అయోధ్య నగరం అరుదైన రికార్డును దక్కించుకుంది. సరయూ నదీ తీరంలో మూడు లక్షలకు పైగా దీపాలను ఐదు నిమిషాల్లోనే వెలిగించడంతో ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారి రిషినాథ్ మాట్లాడుతూ.. దీపోత్సవ్ వేడుకల్లో భాగంగా ఈ రికార్డ్ నమోదైనట్టు తెలిపారు. ఐదు నిమిషాల్లో 3,01,152 దీపాలు వెలిగించి అయోధ్యవాసులు ఈ రికార్డును సృష్టించినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, దక్షిణ కొరియా అధ్యక్షుడి సతీమణి కిమ్‌ జాంగ్‌ సూక్‌ పాల్గొన్నారు.

More Telugu News