Andhra Pradesh: విజయవాడలో దోపిడీకి యత్నించిన దొంగలు.. చావగొట్టి పోలీసులకు అప్పగించిన స్థానికులు!

  • దుర్గాపురం రైల్వేక్వార్టర్స్ వద్ద ఘటన
  • గొంతు కోస్తామని బెదిరించిన దొంగలు
  • కేసు నమోదు చేసిన పోలీసులు

కృష్ణా జిల్లా విజయవాడలో దోపిడీ దొంగల కలకలం చెలరేగింది. ఇక్కడి దుర్గాపురం రైల్వేక్వార్టర్స్ లోని ఓ ఇంట్లోకి దొంగలు ఈ రోజు మధ్యాహ్నం చొరబడ్డారు. ఇంట్లోని నగలు, నగదును ఇవ్వాలనీ, లేదంటే గొంతు కోస్తామని బెదిరించారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు ఆ ఇంటిని చుట్టుముట్టి దొంగలను పట్టుకున్నారు.

అనంతరం వాళ్లను బయటకు లాక్కునివచ్చి స్తంభానికి కట్టేసి చావబాదారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితులను స్టేషన్ కు తరలించారు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో వీరిపై కేసు నమోదు చేశారు. విజయవాడలో పట్టపగలు దోపిడీకి పాల్పడేందుకు దుండగులు యత్నించడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

More Telugu News