telangana voters list: ప్రశ్నించేందుకు ఇది సరైన సమయం కాదు.. జోక్యం చేసుకోలేం: హైకోర్టు

  • ఓటర్ల జాబితాలో తప్పులున్నాయన్న పిటిషనర్‌ వాదనపై ధర్మాసనం వ్యాఖ్య
  • పిటిషన్‌ దాఖలు చేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి
  • విచారణను ఈ నెల 16కు వాయిదా వేసిన న్యాయస్థానం

ఎన్నికల వేళ ఓటర్ల జాబితా అంశంపై జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని, ఆ జాబితాతోనే ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతోందంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల కమిషన్‌ వ్యవహారాల్లో ఎలా తలదూరుస్తామని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఓటర్ల జాబితా అంశంపై కాంగ్రెస్‌ ఇప్పటికే పలుమార్లు కోర్టును ఆశ్రయించింది.

More Telugu News