Air India: ఎయిరిండియా సిబ్బంది మెరుపుసమ్మె... ఎయిర్ పోర్టుల్లో చిక్కుకున్న వేలాది మంది!

  • డిమాండ్ల పరిష్కారానికి సమ్మె
  • ఆలస్యంగా నడుస్తున్న విమాన సర్వీసులు
  • పరిస్థితి చక్కబడుతుందన్న ఏఐ ప్రతినిధి

దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ, ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ఉద్యోగులు ఈ ఉదయం మెరుపుసమ్మెను ప్రారంభించడంతో దేశవ్యాప్తంగా ఆ ప్రభావం విమాన సర్వీసులపై పడింది. ఎయిరిండియా విమానాలను ఎక్కాల్సిన వేలాది మంది ప్రయాణికులు ముంబై, న్యూఢిల్లీ తదితర ఎయిర్ పోర్టుల్లో పడిగాపులు పడుతుండగా, కనెక్టింగ్ సేవలు మరింత ఆలస్యమయ్యేలా ఉన్నాయి.

ఇటీవల విధుల నుంచి తొలగించిన ఉద్యోగిని వెంటనే తిరిగి తీసుకోవాలని ముంబైలోని కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెను ప్రారంభించినట్టు తెలుస్తోంది. కాగా, విమాన సర్వీసులకు ఆటంకాలు కలుగకుండా చర్యలు తీసుకున్నామని, విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లిన వారిని వెనక్కు పిలిపించి, సర్వీసులను ఆలస్యంగా నడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని ఎయిరిండియా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

More Telugu News