maoists posters: ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు: మంచిర్యాల జిల్లాలో పోస్టర్లు

  • బెల్లంపల్లిలో పద్దెనిమిది చోట్ల పోస్టర్లు ప్రత్యక్షం
  • పోస్టర్లతోపాటు సీడీలు, లేఖలు విడుదల
  • స్థానికంగా కలకలం

మంచిర్యాల జిల్లాలో మావోయిస్టులు కలకలం సృష్టించారు. ముందస్తు ఎన్నికల ప్రచారంతో బిజీగా ఉన్న రాజకీయ నాయకులకు షాకిచ్చారు. ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని పద్దెనిమిది చోట్ల సింగరేణి కార్మిక సంఘం పేరుతో మావోయిస్టులు అంటించిన ఈ పోస్టర్లు స్థానికంగా తీవ్ర కలకలానికి కారణమవుతున్నాయి. పోస్టర్లతో పాటు సీడీలు, లేఖలను కూడా మావోయిస్టులు విడుదల చేశారు.

More Telugu News