Deepavali: హైదరాబాద్‌లో విషాదం నింపిన దీపావళి.. కళ్లకు గాయాలతో ఆసుపత్రికి క్యూ

  • కళ్లకు గాయాలతో ఆసుపత్రులకు పరుగులు
  • ఒక్క సరోజినీదేవి కంటి ఆసుపత్రిలోనే 50 మంది చేరిక
  • 8 మందికి శస్త్రచికిత్స

హైదరాబాద్‌లోని పలు కుటుంబాల్లో దీపావళి విషాదం నింపింది. పండుగ సందర్భంగా టపాసులు కాల్చిన పలువురు కళ్లకు గాయాలతో నగరంలోని వివిధ ఆసుపత్రులకు క్యూకట్టారు. వీరిలో చాలామంది సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో చేరారు. టపాసులు కాల్చిన వారితోపాటు రోడ్డుపై వెళ్తున్న పాదచారులు కూడా గాయపడ్డారు.

కళ్లకు తీవ్రగాయాలైన వారికి సరోజినీదేవి వైద్యులు శస్త్రచికిత్సలు చేశారు. కళ్లకు గాయాలతో మొత్తం 50 మంది ఆసుపత్రిలో చేరినట్టు వైద్యులు తెలిపారు. వీరిలో 8 మంది కళ్లు దారుణంగా దెబ్బతిన్నట్టు చెప్పారు. మిగతా వారి కళ్లు స్వల్పంగా దెబ్బతిన్నట్టు పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చిన వారిలో పెద్దలు, పిల్లలు కూడా ఉన్నారు. బుధవారం నలుగురు వైద్యులు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నట్టు ఆస్పత్రి మెడికల్‌ ఆఫీసర్‌ బేగ్‌ తెలిపారు.

More Telugu News