Khammam District: కుటుంబ కలహాలతో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

  • ఈ తెల్లవారుజామున ఘటన
  • కుటుంబ కలహాలతోనేనన్న పోలీసులు
  • కానిస్టేబుల్‌ను చర్లకు చెందిన శ్రీనివాస్‌గా గుర్తింపు

కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ కానిస్టేబుల్ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం 15 బెటాలియన్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు చెందిన కానిస్టేబుల్ శ్రీనివాస్ గురువారం తెల్లవారుజామున కణతకు తుపాకి గురిపెట్టి కాల్చుకున్నాడు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీనివాస్ మృతదేహాన్ని సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News