Visakhapatnam District: విశాఖపట్నంలో దారుణం: చిన్నారిని చంపేసి పెట్రోల్ పోసి తగులబెట్టిన దుండగులు!

  • చోడవరం మండల కేంద్రంలో ఘటన
  • తగులబెట్టి పరారైన దుండగులు
  • కేసు నమోదు చేసిన పోలీసులు

విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ చిన్నారిని దారుణంగా చంపేసిన దుండగులు మృతదేహాన్ని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి దహనం చేశారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. ఈ ఘటన జిల్లాలోని చోడవరం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఇక్కడి ఫారెస్ట్ వెదురు డిపో సమీపంలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వీటిని పోస్ట్ మార్టంకు తరలించారు. గుర్తుతెలియని దుండగులెవరో ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిందితులు ఎవరో తెలుసుకునేందుకు ఈ మార్గంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామనీ, వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని పేర్కొన్నారు.

More Telugu News