2 t20: విండీస్ కు 196 పరుగుల భారీ విజయలక్ష్యం

  • లక్నో వేదికగా రెండో టీ20 మ్యాచ్
  • చెలరేగి ఆడిన రోహిత్ శర్మ
  • టీమిండియా స్కోర్: 195/2 (నిర్ణీత 20 ఓవర్లలో)

రెండో టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ విజయలక్ష్యం196 పరుగులుగా టీమిండియా నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా 195 పరుగులు చేసింది. కాగా, ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. వందకు పైగా పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

భారత్ జట్టు స్కోర్: 

శిఖర్ ధావన్ (43), ఆర్ ఆర్ పంత్ (5), రోహిత్ శర్మ 111 పరుగులతో, కేఎల్ రాహుల్ 26 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

వెస్టిండీస్ బౌలింగ్: 

పియర్ -1, అలెన్-1

More Telugu News