maha kutami: మాది చేతగానితనంగా భావిస్తే మేమేంటో చూపిస్తాం!: సీపీఐ నేత కూనంనేని

  • ఇప్పటికే 14 సీట్ల నుంచి 5 సీట్లకు దిగొచ్చాం
  • మాది చేత గాని తనంగా భావిస్తే మేమేంటో చూపిస్తాం
  • నాన్చుకుంటూ పోవడం మిత్రధర్మం అనిపించుకోదు

మహాకూటమిలో సీపీఐ ఉన్నా లేకపోయినా ఒకటేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయన్న విషయమై ఆ పార్టీ నేత కూనంనేని సాంబశివరావు స్పందించారు. కూటమి నుంచి తాము వెళ్లిపోవాలని ఎవరైనా అనుకుంటే అది వారి తెలివి తక్కువ తనమేనని విమర్శించారు. తమది చేతగాని తనంగా భావిస్తే తామేంటో చూపిస్తామని, ఇప్పటికే 14 సీట్ల నుంచి 5 సీట్లకు దిగొచ్చామని, మరి, కాంగ్రెస్ పార్టీ తమకు రెండు సీట్లిస్తుందో, 5 సీట్లిస్తుందో తమకు తెలియదని అన్నారు. నాన్చుకుంటూ పోవడం మిత్రధర్మం అనిపించుకోదని, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ విజ్ఞత ప్రదర్శిస్తుందని ఆశిస్తున్నామని చెప్పిన కూనంనేని, ఈ వ్యాఖ్యల ద్వారా తామేమీ కాంగ్రెస్ పార్టీని బెదిరించడం లేదనడం గమనార్హం.

More Telugu News