rajahmundry: రాజమండ్రి నుంచి చెన్నయ్ వెళ్లిన ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య... సురక్షితంగా ల్యాండింగ్!

  • 40 మంది ప్రయాణికులతో చెన్నై బయల్దేరిన విమానం
  • ల్యాండ్ అవబోతున్న సమయంలో రెండో ఇంజిన్ ఫెయిల్
  • చివరకు సురక్షితంగా ల్యాండ్ అయిన విమానం

రాజమండ్రి నుంచి 40 మంది ప్రయాణికులతో చెన్నై బయల్దేరిన ఇండిగో విమానం (6ఈ 7123)లో సాంకేతిక సమస్యలు తలెత్తడం కలకలం రేపింది. చెన్నైలో ల్యాండ్ కావాల్సిన తరుణంలో ఈ సమస్యలు తలెత్తాయి. విమానంలోని రెండో ఇంజిన్ ఫెయిల్ అయింది. ఈ నేపథ్యంలో, పైలట్ నుంచి సమాచారం అందుకున్న విమానాశ్రయ అధికారులు హుటాహుటిన విమానాశ్రయంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. ఇతర విమానాల రాకపోకలను ఆపేశారు. అనంతరం గాల్లో ఒక రౌండు వేసిన తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News