sensex: పతనమైన రూపాయి విలువ.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 60 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 29 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 14 శాతం లాభపడ్డ యూకో బ్యాంక్

అమెరికా డాలరుతో పోల్చితే రూపాయి విలువ మరింత పతనమవడం దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 60 పాయింట్లు కోల్పోయి 34,950కి పడిపోయింది. నిఫ్టీ 29 పాయింట్లు నష్టపోయి 10,524 వద్ద స్థిరపడింది.

టాప్ గెయినర్స్:
యూకో బ్యాంక్ (14.09%), జెట్ ఎయిర్ వేస్ (9.47%), పీసీ జువెలర్స్ (6.90%), ఇన్ఫీబీమ్ అవెన్యూస్ (6.73%), మేఘమణి ఆర్గానిక్స్ (6.64%).

టాప్ లూజర్స్:
వెంకీస్ లిమిటెడ్ (-13.63%), సిప్లా (-7.33%), సన్ టీవీ నెట్ వర్క్స్ (-6.88%), ఆస్ట్రాల్ పాలీ టెక్నిక్ (-6.55%), ఓరియంట్ సిమెంట్ (-5.80%).      

More Telugu News