palamaner: మూడేళ్లుగా అత్యాచారం చేస్తున్న తండ్రి.. పట్టించుకోని తల్లి!

  • చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో దారుణం
  • స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించిన బాధితురాలు
  • పలమనేరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

అనునిత్యం అండగా ఉంటూ కాపాడాల్సిన కన్నతండ్రే ఆమె పాలిట రాక్షసుడిగా మారాడు. గత మూడేళ్లుగా కూతురుపై అత్యాచారం చేస్తూ లైంగికవాంఛలు తీర్చుకుంటున్నాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. తండ్రి దారుణాలను తట్టుకోలేని బాధితురాలు కొన్ని రోజుల క్రితం తన తల్లికి చెప్పింది. ఆమె పట్టించుకోకపోవడంతో... చివరకు స్థానికంగా ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలిని ఆశ్రయించింది. వెంటనే ఆమె పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

More Telugu News