Coins: బోరుబావి నుంచి నీళ్లతో పాటు నాణేలు!

  • వాట్సాప్‌లో సంచలనం సృష్టిస్తున్న వీడియో
  • బోర్లు తవ్విన దాఖలాలైతే లేవు
  • నిజంగా ఎక్కడ జరిగిందో తెలియాల్సి ఉంది

తెలంగాణలోని సంగారెడ్డిలో ఓ వింత ఘటన చోటుచేసుకుందంటూ వాట్సాప్‌లో ఓ వీడియో సంచలనం సృష్టిస్తోంది. సంగారెడ్డిలోని శాంతినగర్‌లో బోరు బావి తవ్వితే నీళ్లతో పాటు నాణేలు కూడా వస్తున్నాయట. ఇప్పుడు ఈ విషయం వాట్సాప్ వీడియో గ్రూపుల్లో సంచలనం సృష్టిస్తోంది. అయితే శాంతి నగర్‌లో మాత్రం రెండు, మూడు రోజులుగా ఎక్కడా బోర్లు తవ్విన దాఖలాలైతే లేవు. మరి సంగారెడ్డిలో జరిగిందని చెబుతున్న ఘటన నిజంగా ఎక్కడ జరిగిందో తెలియాల్సి ఉంది.

More Telugu News