Chandrababu: కేంద్రానికి చంద్రబాబు రాసిన 'ప్రేమలేఖలు' ఒకటీ రెండూ కాదు ముప్పై!: కేటీఆర్ ఫైర్

  • తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ అక్రమం అట
  •  చంద్రబాబు చేతికి పొరపాటున మన జుట్టివ్వొద్దు
  • రైతులు తమ వేళ్లతో తమ కళ్లను పొడుచుకోవద్దు

'తెలంగాణలో ప్రాజెక్టులను ఆపాలని కోరుతూ కేంద్రానికి చంద్రబాబు రాసిన ప్రేమలేఖలు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ముప్పై' అంటూ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రినగర్ లో ఈరోజు నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ అక్రమం అంటూ ఆ లేఖల్లో రాశారని, తెలంగాణ రైతుల నోట్లో మట్టికొట్టే పని చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దొంగలూ దొంగలూ కలిసి ఊళ్లు పంచుకున్నట్టుగా కాంగ్రెస్, చంద్రబాబు ఒక్కటయ్యారని విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల పథకంపై కత్తి కట్టిన చంద్రబాబు చేతికి పొరపాటున మన జుట్టిస్తే కనుక తెలంగాణ రైతులు తమ వేళ్లతో తమ కళ్లను పొడుచుకున్నట్లేనని అన్నారు.

More Telugu News