baba ramdev: ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ ఉన్న వారి ఓటు హక్కు రద్దు చేయాలి: బాబా రాందేవ్

  • సంతానాన్ని ఇద్దరు పిల్లలకే పరిమితం చేయాలి
  • ఆ విధంగా ఆంక్షలు విధించాలి
  • బ్రహ్మచారులకు ప్రత్యేక గౌరవం ఇవ్వాలి

ఇద్దరు పిల్లలు కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్న దంపతులకు ఓటు హక్కు రద్దు చేయాలని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, పెళ్లి చేసుకోవాలనుకునే వారిని ఇద్దరు పిల్లలకు మాత్రమే పరిమితం చేసేలా ఆంక్షలు ఉండాలని, ఒకవేళ, అంతకంటే ఎక్కువ సంతానం కలిగితే వారి ఓటు హక్కు తొలగించాలని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా బ్రహ్మచారుల గురించి ఆయన ప్రస్తావిస్తూ, మనదేశంలో పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోవాలను కున్న వారికి ప్రత్యేకగౌరవం ఇవ్వాలని సూచించారు.

More Telugu News