strip-search: పంజాబ్ స్కూల్‌లో దారుణం.. ఏడో తరగతి అమ్మాయిల దుస్తులు విప్పించి శానిటరీ ప్యాడ్స్‌ కోసం వెతికిన టీచర్లు!

  • 15 మంది విద్యార్థుల దుస్తులు విప్పించి తనిఖీ
  • ఇద్దరు టీచర్లను బదిలీ చేసిన ప్రభుత్వం
  • అజ్ఞాతంలో మరో టీచర్

పంజాబ్‌లోని ఫజికా జిల్లాలో ఓ స్కూల్‌లో దారుణం చోటుచేసుకుంది. శానిటరీ నాప్‌కిన్స్ కోసం 7, 8 తరగతి చదువుతున్న 15 మంది బాలికల దుస్తులు విప్పించి మరీ టీచర్లు తనిఖీ చేశారు. స్కూలు టాయిలెట్‌లో ఓ శానిటరీ న్యాప్‌కిన్ కనిపించడంతో దానిని ఎవరు ధరించారో తెలుసుకునేందుకు టీచర్లు ప్రయత్నించారు.

ఏడు, ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికల దుస్తులు విప్పించి తనిఖీ చేశారు. ఈ విషయాన్ని బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పారు. వారు స్కూలు అధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై దుమారం రేగడంతో ప్రభుత్వం స్పందించింది. ఇద్దరు టీచర్లను బదిలీ చేసింది. మరో టీచర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనపై సోమవారం నాటికి దర్యాప్తు పూర్తి చేయాల్సిందిగా విద్యాశాఖ కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు.

కాగా, ఇటువంటి ఘటనే ఈ ఏడాది మార్చిలో మధ్యప్రదేశ్‌లో జరిగింది. హాస్టల్ ఆవరణలో శానిటరీ నాప్‌కిన్ దొరకడంతో ఏకంగా 40 మంది బాలికల దుస్తులు విప్పించి తనిఖీ చేశారు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది.

More Telugu News