Andhra Pradesh: కుటుంబ కలహాల ఎఫెక్ట్.. అత్తను బిందెతో కొట్టిచంపిన కోడలు!

  • పశ్చిమగోదావరి జిల్లా రేలంగిలో ఘటన
  • అత్తాకోడళ్ల మధ్య తరచుగా గొడవలు
  • కేసు నమోదు చేసిన పోలీసులు

కుటుంబ కలహాల కారణంగా ఓ ప్రాణం బలైపోయింది. వాగ్వాదం చిలికిచిలికి గొడవగా మారడంతో స్వయంగా కోడలే అత్తను దారుణంగా హతమార్చింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలోని ఇరగవరం మండలంలో చోటుచేసుకుంది.
జిల్లాలోని రేలంగి గ్రామంలో కూసంపూడి మహాలక్ష్మి తన కొడుకు, కోడలితో కలిసి ఉంటోంది.

అయితే కోడలితో ఆమెకు తరచూ వాగ్వాదం చోటుచేసుకునేది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం ముదరడంతో నిన్న పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న బిందెతో కోడలు మహాలక్ష్మిపై దాడిచేసింది. తలకు బిందె గట్టిగా తగలడంతో తీవ్రంగా గాయపడ్డ మహాలక్ష్మి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News