vanteru pratapreddy: వంటేరు ప్రతాప్ రెడ్డిపై గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

  • హరీశ్ రావుపై వంటేరు వివాదాస్పద వ్యాఖ్యలపై ఫైర్ 
  • రైతు సమన్వయ సమితి సభ్యుడు ఈ మేరకు ఫిర్యాదు 
  • ఘన్ పూర్ లో టీఆర్ఎస్-కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ

తెలంగాణ మంత్రి హరీశ్ రావుపై వంటేరు ప్రతాప్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. రైతు సమన్వయ సమితి సభ్యుడు దేవీరవీందర్ ఈ మేరకు ఫిర్యాదు చేశారు. హరీశ్ రావుపై వంటేరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా, మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని ఘన్ పూర్ లో టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి తోపులాటకు దారితీసింది. ఈ క్రమంలో వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రచారాన్ని టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు.

More Telugu News