Congress: తెలుగు తమ్ముళ్ల పౌరుషం, రోషం ఏమైంది?: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

  • కాంగ్రెస్-టీడీపీ పొత్తా?
  • మీ ఆరాధ్యదైవం ఎన్టీఆర్‌ ఆత్మ ఘోష వినపడలేదా?
  • మీ రక్తం మరిగిపోవటం లేదా?’

తెలంగాణలో కాంగ్రెస్- టీడీపీ పొత్తుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ, ఆ పార్టీతో చేతులు కలపడమేంటని ప్రశ్నించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఏ సిద్ధాంతంతో ఎన్టీఆర్ పార్టీని స్థాపించారో, ఆ సిద్ధాంతానికి చంద్రబాబు తిలోదకాలు ఇచ్చారని విమర్శించారు.

‘తెలుగు తమ్ముళ్ళ రోషం, పౌరుషం ఏమైంది? మీ ఆరాధ్యదైవం ఎన్టీఆర్‌ ఆత్మ ఘోష వినపడలేదా? నాడు వెన్నుపోటు పొడిచిన బాబు నేడు ఆయనను ఆత్మక్షోభకు గురిచేస్తే తిరగబడరా? ఏ సిద్ధాంతంతో ఎన్టీఆర్ పార్టీ పెట్టారో దానిని చంద్రబాబు కాంగ్రెస్ కాళ్ళ దగ్గర పెట్టి కళ్ళకద్దుకుంటుంటే మీ రక్తం మరిగిపోవటం లేదా?’ అని విజయసాయి తన ట్వీట్ లో ప్రశ్నించారు.

More Telugu News