Kidari Sarveswara Rao: కిడారి, సోమ హత్యలకు కారణాన్ని వెల్లడించిన మావోలు

  • కిడారి, సోమలను హత్య చేసింది మేమే
  • ఏవోబీ అధికార ప్రతినిధి పేరుతో లేఖ
  • మైనింగ్ మాఫియాను నిలిపివేయాలి

ఇటీవల విశాఖ జిల్లాలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు దారుణంగా హత్య చేసిన విషయం విదితమే. వారి హత్యలపై మావోయిస్టు పార్టీ  శుక్రవారం ఒక లేఖను విడుదల చేసింది. ఆ పార్టీ ఏవోబీ అధికార ప్రతినిధి పేరుతో లేఖను విడుదల చేశారు. మైనింగ్ మాఫియాగా మారి ఆదివాసీల ప్రకృతి సంపదను కొల్లగొట్టినందుకే వీరిని హత్య చేసినట్టు మావోలు పేర్కొన్నారు. ఇకనైనా మైనింగ్ మాఫియాను నిలిపివేయాలని, లేదంటే బాధ్యులపై చర్యలు తప్పవని ఆ లేఖలో మావోలు హెచ్చరించారు.

More Telugu News