chaitu: 'రోజుకు సమంత ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంది' అంటూ చైతూను ఆటపట్టించిన రానా!

  • రానా టాక్ షోకి 'సవ్యసాచి' టీమ్ 
  • ఆదివారం ప్రసారం కానున్న ఎపిసోడ్ 
  • సరదాగా సందడి చేస్తోన్న ప్రోమో  

నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'సవ్యసాచి' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో చందూ మొండేటి .. చైతూ .. నిధి అగర్వాల్ కలిసి , రానా నిర్వహిస్తోన్న 'నెం.1 యారీ ' టాక్ షోకి వచ్చారు. ఈ ఆదివారం ఈ కార్యక్రమం ప్రసారం కానుండగా, అందుకు సంబంధించిన ప్రోమో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

"తొందరపడి పెళ్లి చేసుకున్నానే అని ఎప్పుడైనా అనిపించిందా? అంటూ ఈ షోలో చైతూను రానా సరదాగా ఆటపట్టించాడు. "అమ్మాయిల్లో చైతూ ఎక్కువగా ఏం గమనిస్తాడు?" అని దర్శకుడు చందూ మొండేటిని రానా అడగ్గా, 'వద్దులే అన్నా' అంటూ దాటేశాడు. " షూటింగులో ఉండగా సమంత రోజుకి ఎన్నిసార్లు చైతూకి ఫోన్ చేస్తుంది?' అని చందూ మొండేటిని రానా అడిగాడు. "చైతూ రెండు మూడు సార్లు ఫోన్ తీసుకుని కంగారుగా పక్కకి వెళతాడు .. ఆ కాల్స్ సమంత నుంచి వచ్చి వుంటాయని అనుకుంటున్నాను" అంటూ చందూ నవ్వేశాడు.     

More Telugu News