Petrol: నేడు కూడా తగ్గిన 'పెట్రో' ధరలు!

  • పెట్రోలుపై 19 పైసలు తగ్గుదల
  • 14 పైసలు తగ్గిన లీటర్ డీజిల్ ధర
  • విజయవాడలో రూ. 83.34కు లీటరు పెట్రోలు

పెట్రోలు ధరలు వరుసగా 16వ రోజు కూడా తగ్గాయి. నేడు పెట్రోలుపై 19 పైసలు, డీజిల్ పై 14 పైసల మేరకు ధర తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వెల్లడించాయి. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 79.18, డీజిల్ ధర రూ. 73.64కు చేరింది.

ఇదే సమయంలో ముంబైలో పెట్రోలు ధర రూ. 84.68, డీజిల్ ధర రూ. 77.18కి తగ్గింది. ఇక విజయవాడలో పెట్రోలు ధర రూ. 83.34, డీజిల్ ధర రూ. 79.07గా ఉండగా, గుంటూరులో పెట్రోలు ధర లీటరుకు రూ. 83.54, డీజిల్ రూ. 79.27 వద్ద కొనసాగుతున్నాయి. ధరల తగ్గుదల మరింత కాలం కొనసాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News