raana: రానా హీరోగా 'విరాటపర్వం 1992'.. హీరోయిన్ గా సాయిపల్లవి!

  • రానాతో వేణు ఉడుగుల
  • కొత్తదనంతో కూడిన కథాకథనాలు
  • త్వరలోనే సెట్స్ పైకి

'నీది నాది ఒకే కథ' సినిమాతో దర్శకుడిగా వేణు ఉడుగుల మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తరువాత నుంచి ఆయన ఒక కథపై కసరత్తు చేస్తూ పూర్తి రూపాన్ని తీసుకొచ్చాడు. ఈ కథకి ఆయన 'విరాటపర్వం 1992' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నాడు. ఈ సినిమాను నానితో గానీ .. నితిన్ తో గాని .. శర్వానంద్ తో గాని రూపొందించాలని ఆయన ప్రయత్నించాడు. అయితే ఈ ముగ్గురూ కూడా ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీగా ఉండటంతో, వేణు ఈ కథను రానాకి వినిపించాడు. కథాకథనాల్లోని కొత్తదనం కారణంగా వెంటనే రానా ఈ ప్రాజెక్టు చేయడానికి అంగీకరించాడు. ఈ సినిమాలో కథానాయికగా సాయిపల్లవిని ఎంపిక చేసుకున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. రానా - సాయిపల్లవి కాంబినేషన్లో రూపొందనున్న ఈ సినిమాపై అంచనాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

More Telugu News