india: విండీస్ కు చుక్కలు చూపించిన భారత బౌలర్లు.. మూడు వికెట్లు ఢమాల్

  • 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన విండీస్
  • కీరన్ పావెల్, హోప్ లు డకౌట్
  • చెరో వికెట్ తీసిన భువనేశ్వర్, బుమ్రా, జడేజా

తిరువనంతపురంలో జరుగుతున్న చివరి వన్డేలో... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ కు భారత బౌలర్లు ఆదిలోనే చుక్కలు చూపించారు. స్కోరు బోర్డుపై ఒక పరుగు చేరగానే తొలి వికెట్ ను, మరో పరుగు చేరగానే రెండో వికెట్ ను, 36 పరుగుల వద్ద మూడో వికెట్ ను బలిగొన్నారు.

ఓపెనర్ కీరన్ పావెల్ భువనేశ్వర్ బౌలింగ్ లో ధోనీకి క్యాచ్ ఇచ్చి డకౌట్ గా వెనుదిగాడు. అనంతరం హోప్ కూడా బుమ్రా బౌలింగ్ లో పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మార్లన్ శామ్యూల్స్ ధాటిగా ఆడుతూ 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయ్యాడు. జడేజా బౌలింగ్ లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రోవ్మన్ పావెల్ 8, హెట్మేయర్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. విండీస్ స్కోరు 13.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 42 పరుగులు.

More Telugu News