Varanasi: కాశీలో కలకలం... డిస్కౌంట్ ఇవ్వలేదని ఇద్దరిని షూట్ చేసి చంపిన వ్యక్తి!

  • వారణాసిలోని జేహెచ్వీ మాల్ లో ఘటన
  • అడిగినంత డిస్కౌంట్ ను ఇవ్వలేమన్న ఉద్యోగులు
  • ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోని జేహెచ్వీ మాల్ లో ఇద్దరి హత్య తీవ్ర కలకలం రేపింది. మాల్ కు వచ్చిన ఓ వ్యక్తి, తాను అడిగిన డిస్కౌంట్ ను ఇవ్వలేదన్న ఆగ్రహంతో, ఓ షాపులోని ఇద్దరు సేల్స్ మెన్ ను కాల్చి చంపాడు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఓ బట్టల దుకాణంలో ఈ ఘటన జరిగింది. కస్టమర్ అడిగినంత తగ్గింపు ధరను ఇవ్వలేమని షాపులోని ఉద్యోగి వెల్లడించగా, మొదలైన వాగ్వాదం కాల్పులకు దారితీసిందని పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనలో సునీల్, గోపీ అనే ఇద్దరూ చనిపోయారని, తీవ్ర గాయాలపాలైన గోలు, విశాల్ ను ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ఈ ఘటనతో మాల్ లో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొనగా, మాల్ ను మూసివేసి, కస్టమర్లను బయటకు పంపించారు. ఈ ఘటనలో ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదని, సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నామని, కేసు విచారణ కొనసాగుతుందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

More Telugu News