Vizag: జగన్ చొక్కా చాలా ముఖ్యం... ఇప్పించాలని కోర్టును ఆశ్రయించిన పోలీసులు!

  • ఆ సమయంలో జగన్ చొక్కాకు రక్తం అంటింది
  • ఆయన దాన్ని మార్చుకుని హైదరాబాద్ వెళ్లారు
  • విచారణలో కీలక సాక్ష్యమంటున్న విశాఖ పోలీసులు

వైజాగ్ ఎయిర్ పోర్టులో హత్యాయత్నం జరిగినప్పుడు, వైఎస్ జగన్ ధరించిన చొక్కాను స్వాధీనం చేసుకునే అవకాశం కల్పించాలని విశాఖ పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ విషయాన్ని వెల్లడించిన విశాఖ పశ్చిమ ఏసీపీ ఎల్‌.అర్జున్‌, హత్యాయత్నం సమయంలో ధరించిన చొక్కాకు రక్తం అంటడంతో, జగన్‌ దాన్ని మార్చుకుని అక్కడి నుంచి వెళ్లారని గుర్తు చేశారు. కేసు విచారణలో ఆ షర్ట్ తమకు చాలా కీలక సాక్ష్యమని తెలిపారు. దాన్ని ఆధారంగా సమర్పించాల్సి వుందని గుర్తు చేశారు. ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావు సెల్‌ఫోన్ల నుంచి కాల్‌ డేటాను విశ్లేషించగా, 321 మందితో పలుమార్లు మాట్లాడినట్లు వెల్లడైందని తెలిపారు.

More Telugu News