Muragadas: ఆ సమయంలో చాలా బాధపడ్డా.. నాతో సహా ఐదారుగురు ఏడ్చారు: మురుగదాస్‌

  • బాధాకర సన్నివేశాన్ని వివరించిన మురుగదాస్‌
  • అప్పుల బాధ భరించలేక కుటుంబం ఆత్మహత్య
  • సన్నివేశం పూర్తయ్యాక సెట్ అంతా నిశ్శబ్దం

‘సర్కార్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మురుగదాస్‌ దర్శకత్వంలో దళపతి విజయ్, కీర్తి సురేశ్ ఈ చిత్రంలో జంటగా నటించారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మాణ సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా మురుగదాస్‌ ఓ ఇంటర్వ్యూలో చిత్రానికి సంబంధించిన ఓ బాధాకర సన్నివేశాన్ని వివరించారు.

ఆ సన్నివేశం నటీనటులకు తాను వివరిస్తుంటేనే చాలా బాధపడ్డానని.. సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు తనతో సహా ఐదారుగురు కన్నీటి పర్యంతమయ్యారని ఆయన వివరించారు. తిరునల్వేలిలో అప్పుల బాధ భరించలేక ఒకే కుటుంబంలోని నలుగురు నిప్పంటించుకున్న సంఘటన ఆధారంగా ఆ సన్నివేశాన్ని తెరకెక్కించినట్టు మురుగదాస్‌ తెలిపారు. ఈ సన్నివేశం పూర్తయ్యాక ఒకరి మొహం మరొకరు చూడలేదని.. సెట్ అంతా నిశ్శబ్దం ఆవరించిందని మురుగదాస్‌ తెలిపారు.

More Telugu News