ys jagan: జగన్ పై దాడి కేసు.. నిందితుడి తల్లిదండ్రులను విచారించనున్న అధికారులు

  • జగన్ పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం
  • శ్రీనివాస్ తల్లిదండ్రులను విశాఖకు తరలిస్తున్న సిట్
  • గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాస్ స్నేహితుల విచారణ

వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నిందితుడు శ్రీనివాస్ తల్లిదండ్రులను సిట్ అధికారులు విచారించనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ తల్లిదండ్రులను విశాఖపట్టణానికి తరలిస్తున్నారు. కాగా, గుంటూరు జిల్లా నుంచి శ్రీనివాస్ స్నేహితులను నలుగురిని పోలీసులు తీసుకొచ్చారు. ఆ నలుగురిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.  

More Telugu News