nagachaitanya: రీమిక్స్ సాంగ్ తో దుమ్మురేపేస్తోన్న చైతూ

  • 'అల్లరి అల్లుడు'లోని సాంగ్ రీమిక్స్ 
  • సంగీత దర్శకుడిగా కీరవాణి 
  • వచ్చేనెల 2వ తేదీన విడుదల

నాగచైతన్య కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'సవ్యసాచి' వచ్చేనెల 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా నిధి అగర్వాల్ కనిపించనుంది. ప్రతినాయకుడిగా మాధవన్ కనిపించనున్న ఈ సినిమాలో భూమిక కీలకమైన పాత్రను పోషించింది.గతంలో నాగార్జున హీరోగా చేసిన 'అల్లరి అల్లుడు' సినిమాలోని 'నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయతు ..' అనే హిట్ సాంగ్ ను 'సవ్యసాచి' కోసం రీమిక్స్ చేశారు. గతంలో కీరవాణి స్వరపరిచిన ఆ పాటను మళ్లీ ఆయనే ఈ సినిమా కోసం రీమిక్స్ చేయడం విశేషం. తాజాగా ఈ సినిమా నుంచి ఈ రీమిక్స్ సాంగ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈనాటి ట్రెండ్ కి తగినట్టుగానే ఈ పాటకు ట్యూన్ చేశారు .. షూట్ చేశారు. నాయకా నాయికలపై చిత్రీకరించిన ఈ పాట, ఫాస్టు బీట్ గా యూత్ కి కనెక్ట్ అయ్యేలానే వుంది. 

More Telugu News