Srinivasa Rao: శ్రీనివాసరావు ఫోను నుంచి ఎక్కువ కాల్స్ ఓ మహిళకు వెళ్లాయట.. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • కనిగిరిలో మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ
  • శ్రీనివాసరావుకు అంతా నార్మల్‌గా ఉందన్న వైద్యులు

వైసీపీ అధినేత జగన్‌పై దాడి కేసులో దర్యాప్తు వేగవంతమైంది. శ్రీనివాసరావు ఫోన్ కాల్స్ లిస్టును పరిశీలించిన పోలీసులు అతని ఫోన్ నుంచి ఓ మహిళకు అధికంగా కాల్స్ వెళ్లినట్టు గుర్తించారు. దీంతో కనిగిరిలో ఆ మహిళను సిట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆమెతో పాటు మరో ఇద్దరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా శ్రీనివాసరావుకు నేడు గుండెపోటు రావడంతో కేజీహెచ్‌కు తరలించారు. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతనికి అంతా నార్మల్‌గా ఉందని వెల్లడించారు.

More Telugu News