vijay: 'సర్కార్' కథ కాపీ వివాదం .. రాజీకి వచ్చిన మురుగదాస్

  • వచ్చేనెల 6వ తేదీన 'సర్కార్' విడుదల
  • రాజకీయాల నేపథ్యంలో సాగే కథ 
  • విజయ్ అభిమానుల్లో ఉత్సాహం  

మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా 'సర్కార్' సినిమా నిర్మితమైంది. రాజకీయాల నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. దీపావళి పండుగ కానుకగా ఈ సినిమాను వచ్చేనెల 6వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ కథ తనదేనంటూ వరుణ్ రాజేంద్రన్ అనే రచయిత కోర్టుకెక్కాడు. 12 సంవత్సరాల క్రితమే 'సెంగోల్' అనే పేరుతో ఈ కథను రిజిస్టర్ చేసుకున్నాననీ, ఆ కథకి కొన్ని మార్పులు చేసి మురుగదాస్ 'సర్కార్' సినిమా చేశాడని ఆయన పేర్కొన్నారు.

 అయితే ఇది తాను కష్టపడి తయారు చేసుకున్న కథ అని చెప్పిన మురుగదాస్, విడుదల వాయిదా పడితే నష్టం భారీగా ఉంటుందని భావించి ఫైనల్ హియరింగ్ కి ముందే రాజీకి వచ్చేశాడని అంటున్నారు. వరుణ్ రాజేంద్రన్ కోరినట్టుగా టైటిల్స్ లో ఆయన క్రెడిట్ ఆయనకి ఇచ్చేట్టుగా, 30 లక్షలు చెల్లించేలా రాజీ కుదుర్చుకున్నట్టుగా సమాచారం. ఇక విజయ్ అభిమానులు మాత్రం ఈ సినిమా సునామీ సృష్టించడం ఖాయమంటూ వెయిట్ చేస్తున్నారు.     

More Telugu News